కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో సెలబ్రిటీలు వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మెసేజ్ ఇస్తున్నారు. నిన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వీడియో రిలీజ్ చేయగా ..లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనాపై ఓ ఎగ్జాంపుల్ తో వీడియో మెసేజ్ ఇచ్చారు. ఆ వీడియోలో వరుసగా ఉన్న అగ్గిపుల్లలు ఒకదాని తర్వాత ఒకటి కాలుతుంటాయి. అలా కాలుతుండగా ఒక అగ్గిపుల్ల పక్కకు జరిగింది. ఆ మంట అక్కడితో ఆగి మిగతావి సేఫ్ గా ఉంటాయి. మనుషులు కూడా అందరితో కలవకుండా దూరంగా ఉంటే వైరస్ వ్యాప్తిచెందదనే ఉద్దేశంతో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం కరోనా విస్తరిస్తుండటంతో కష్టమైన ఒకరినొకరు దూరంగా ఉండటం మంచిదన్నారు. వీలైనంతగా ఇంట్లోనే ఉండి ఆ సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించాలని సూచించారు. సామాజిక జీవితాన్ని త్యాగం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. చేతులు శుభ్రంగా ఉంచుతూ..చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. అవసరమైతే శానిటైజర్ ఉపయోగించాలంటూ పోస్ట్ చేశారు.