ఒక్కసారి షూటింగ్ స్టార్టయితే ఎవరూ ఆపలేరు

ఒక్కసారి షూటింగ్ స్టార్టయితే ఎవరూ ఆపలేరు


‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అన్నాడు ఓ సినిమాలో మహేష్ బాబు. ఒక్కసారి షూటింగ్‌‌‌‌ స్టార్టయితే అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ని ఎవరూ ఆపలేరు అంటున్నారు మహేష్‌‌‌‌తో సినిమా తీస్తున్న నిర్మాతలు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చేస్తున్నాడు మహేష్. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అప్‌‌‌‌డేట్ అప్పుడు వస్తోంది ఇప్పుడు వస్తోంది అంటూ రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తోంది. దాంతో నిర్మాతలు నిన్న ఒక నోట్ రిలీజ్ చేశారు. ‘ఒక్కసారి సినిమా షూటింగ్‌‌‌‌ స్టార్టయితే అప్‌‌‌‌డేట్స్ వరుసగా వస్తాయి. అందరి ఎదురుచూపులకు తగిన ఫలితం ఉంటుంది. అంతవరకు కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పారు. దాంతో అప్‌‌‌‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌‌‌‌కి ఓ సమాధానం దొరికినట్టయ్యింది. పరిస్థితులు చక్కబడగానే షూట్‌‌‌‌ని రీస్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌లోను, ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలోను సినిమాలు చేయనున్నాడు మహేష్. ప్రశాంత్‌‌‌‌ నీల్‌‌‌‌తో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఓపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే సొసైటీకి తనవంతుగా ఏదో ఒకటి చేస్తున్నాడు. ఆల్రెడీ కొన్ని ఊళ్లు దత్తత తీసుకున్నాడు. చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నాడు. రీసెంట్‌‌‌‌గా తన సొంత ఊరైన బుర్రిపాలెంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి, ఊరివాళ్లందరికీ వ్యాక్సిన్లు కూడా వేయించాడు.