నాగ చైతన్య దూత సిరీస్లో హైలెట్గా నిలిచిన ఈ నటి ఎవరో తెలుసా?

నాగ చైతన్య దూత సిరీస్లో హైలెట్గా నిలిచిన ఈ నటి ఎవరో తెలుసా?

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దూత(Dhootha). క్రియేటీవ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K Kumar) తెరకెక్కించిన ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్.. సరికొత్త కథా కథనాలతో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోంది. మొత్తం ఏడూ ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఊహకందని ట్విస్ట్, టర్న్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. అందుకే ఈ సిరీస్ లో ప్రతీ పాత్రకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా డీసీపీ క్రాంతి పాత్రలో కనిపించిన నటి తన నటనతో ఆడియన్స్ మనసు దోచేసుకుంది.  

ఆ నటి పేరు పార్వతి తిరువోతు. మళయాళ ఇండస్ట్రీకి చెందిన ఆమె.. పోలీస్ ఆఫీసర్ గా నటించారు అనే కంటే ఆ పాత్రలో జీవించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఎదుటివ్యక్తిని కళ్లతో చదివేసే పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. సిరీస్ సక్సెస్ లో కీ రోల్ పోషించారు. అందుకే ఆమె గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

పార్వతి తిరువోతు మళయాళ ఇండస్ట్రీకి చెందిన ఫేమస్ నటి. 2006లో నటిగా ప్రయాణం ప్రారంభించిన ఆమె.. దాదాపు 17 సంవత్సరాలుగా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. కేవలం మలయాళంలోనే కాదు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించారు. ఉత్తమనటిగా అవార్డులను అందుకున్నారు. ఇక మొదటిసారిగా దూత సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు పార్వతి తిరువోతు. మొదటి ఛాన్స్ తోనే తన నటనతో తెలుగు ఆడియన్స్ మనసులు గెలిచేసుకున్నారు. ఇక దూత సిరీస్ సక్సెస్ తో తెలుగులో కూడా ఆమెకు మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది.