కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం: గుట్కా, పాన్ మసాలాలపై బ్యాన్.. అమ్మితే బుక్కే!

కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం:  గుట్కా, పాన్ మసాలాలపై బ్యాన్.. అమ్మితే బుక్కే!

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గుట్కా, పొగాకు లేదా నికోటిన్ ఉన్న పాన్ మసాలాలపై ఒక సంవత్సరం పాటు పూర్తి నిషేధం విధించింది. దింతో వీటిని తయారు చేయడం, నిల్వ ఉంచడం, సప్లయ్ చేయడం, రవాణా చేయడం సహా అమ్మడం అన్నీ చట్టరీత్యా పూర్తిగా నేరం.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ఆహార భద్రతా కమిషనర్ జూన్ 15, 2026న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత &  ప్రమాణాల చట్టం (2006) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిషేధం దేనికి వర్తిస్తుంది?

*గుట్కా ఇంకా నికోటిన్ లేదా పొగాకు కలిగిన అన్ని రకాల పాన్ మసాలాలు.

*పాన్ మసాలా, పొగాకులను వేర్వేరు ప్యాకెట్లలో పెట్టి అమ్మి, ఆ తర్వాత వినియోగదారులు కలుపుకునేలా విక్రయించే ఉత్పత్తులు (ట్విన్ ప్యాక్‌లు).

*ఉత్పత్తులు ఏ పేరుతో ఉన్నా, చిన్న సాచెట్లలో ఉన్నా, పెద్ద కంటైనర్లలో ఉన్నా, లూజ్‌గా అమ్మినా లేదా ప్యాక్ చేసి అమ్మినా సరే... చివరికి అందులో పొగాకు లేదా నికోటిన్ ఉంటే వాటిపై నిషేధం వర్తిస్తుంది.

ALSO READ : నిజంగానే బస్ కండక్టర్తో వెళ్లిపోయిందా..?

*ఈ ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు కర్ణాటక రాష్ట్రమంతటా ఈ నిషేధం అమలులో ఉంటుంది.