కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతలు

కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతలు

రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో ఆయనకు పాజిటివ్ గా కన్ఫామ్ అయింది. ఖర్గేకు ఎటువంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ ఉన్నారని.. ఆయన కార్యాలయం తెలిపింది. ఖర్గే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోనా సోకిందన్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ లీడర్.. వీరప్ప మొయిలీకి కూడా కరోనా వచ్చింది. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొన్నారు ఇద్దరు నాయకులు. మరోవైపు అసోం, నాగాలాండ్ గవర్నర్ కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో గవర్నర్ జగదీశ్ ముఖికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. గవర్నర్ ను రీసెంట్ గా కలిసిన వారంతా.. కరోనా టెస్టు చేయించుకోవాలని చెప్పారు రాజ్ భవన్ అధికారులు. 

ఇవి కూడా చదవండి: 

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ

ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరి పోరాటమే