MRO ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్

MRO ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్

సంగారెడ్డి :  తన భూ వివాదాన్ని పరిష్కరించాలని సంగారెడ్డి తహశీల్దారు కార్యాలయం ఎదుట ప్రసాద్ అనే వ్యక్తి హాల్ చల్ చేశాడు.  VRO, MRO ల చుట్టూ తిరిగినా తన పని కాలేదని మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని సీసాతో బెదిరించాడు.

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రసాద్‌కు, ఆయన సోదరుల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తహశీల్దార్ కార్యాలయంలోని  VRO జవాన్ నర్సింలును ప్రసాద్ అడగ్గా.. ‘తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని, గత మూడు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించమని కోరగా జాప్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

మూడేళ్లుగా రాత్రి పగలు తేడా లేకుండా MRO ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో మనస్థాపానికి గురై..  ఆ ఆఫీస్ ఎదుటే పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశాడు. అతని చేతిలోని బాటిల్ లాగేసుకున్న పోలీసులు అతన్ని సముదాయించి, కౌన్సిలింగ్ ఇచ్చారు.