రాజేంద్రనగర్ లో వ్యక్తి దారుణ హత్య

 రాజేంద్రనగర్ లో వ్యక్తి దారుణ హత్య

రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలో దారుణం జరిగింది. మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై  అసద్ ఖాన్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. హత్యలో చనిపోయిన అసద్ ఖాన్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులే అసద్ ఖాన్ ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.