మైనర్​పై అత్యాచారం.. ఓ వ్యక్తికి 142 ఏండ్ల జైలు

మైనర్​పై అత్యాచారం.. ఓ వ్యక్తికి 142 ఏండ్ల జైలు

తిరువనంతపురం: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 142 ఏండ్ల కఠిన కారాగారా శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5 లక్షల ఫైన్​ కూడా కట్టాలని తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆనందన్ పీఆర్ అలియాస్ బాబు(41) అనే వ్యక్తి తన బందువుల అమ్మాయి(10)పై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో నిందితుడిపై 2021 మార్చిలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన పతనం తిట్ట కోర్టు.. ఆనందన్​కు 142 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. పోక్సో కేసుల్లో పడిన గరిష్ట శిక్ష ఇదేనని పోలీసులు తెలిపారు.