మందిరాబేడి భర్త చివరి పోస్టు వైరల్

మందిరాబేడి భర్త చివరి పోస్టు వైరల్

ముంబయి: ప్రముఖ నటి, యాంకర్ మందిరాబేడి భర్త రాజ్ కౌశల్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు చేసిన పోస్టు వైరల్ అవుతోంది. బాలీవుడ్ నిర్మాత రాజ్ కౌశల్ బుధవారం హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంతలో ఆయన ఇన్ స్టాలో చేసిన చివరి పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులందరితో కలసి రాజ్ కౌశల్ ఆదివారం వీకెండ్ సరదాగా గడిపారు. అదే విషయాన్ని ఆయన తన ఇన్ స్టా గ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు.

‘‘ఈ ఆదివారం చాలా సరదాగా.. సంతోషంగా గడచిపోయింది. నా భార్య మందిరాబేడి, అంగద్ బేడి, కుటుంబ సన్నిహితులు మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, ఆయన భార్య సాగరిక ఘాట్కే, బాలీవుడ్ నటి నేహా ధూపియా వీళ్లందరితో కలసి గడపడం చాలా సంతోషంగా ఉంది. సూపర్ సండే.. సూపర్ ఫ్రెండ్స్.. సూపర్ ఫన్’’ అంటూ అందరితో కలసి ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశాడు.  అదే ఇప్పుడు వైరల్ అవుతుండడంతో నటి నేహా ధూపియా షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపిన రాజ్ కౌశల్ ఊహించని రీతిలో హఠాన్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోంది.. కన్నీరు ఆగడం లేదంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.