హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో మంగళవారం ఎండ దంచికొట్టింది. మణికొండలో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా.. కుత్బుల్లాపూర్ 42.8, చందానగర్ లో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
దీంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఈ సీజన్లో ఇదే అత్యధికమని, రాబోయే రెండు మూడు రోజులు హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది.
