మన్మథుడి రామావతారం.. థియేట్రికల్‌ ట్రైలర్‌ 2 విడుదల

మన్మథుడి రామావతారం.. థియేట్రికల్‌ ట్రైలర్‌ 2 విడుదల

నాగార్జున హీరోగా రూపొందిన ‘మన్మథుడు 2’ థియేట్రికల్‌ ట్రైలర్‌ గురువారం విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగార్జున సరసన హీరోయిన్ గా రకుల్ నటించింది.

“ఏ అమ్మాయ్ బాగానే వున్నావ్ గదా .. వీడ్ని చేసుకుంటున్నావేంటి?” అనే రావు రమేశ్ డైలాగ్, “నువ్వు ఒంటరిగా ఉండటమే కరెక్ట్ .. నీతో ఎలాగో ఎవరూ ఉండలేరు” అనే రకుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దాదాపుగా విదేశాల్లోనే షూటింగ్ చేసిన ఈ సినిమా వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.