4 రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల నియామకం

4  రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల నియామకం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మంత్రి శ్రీనివాస్ ను అధిష్టానం తప్పించి.. పంజాబ్ బాధ్యతలు అప్పగించింది. ఇక నుంచి చండీగఢ్​ కేంద్రంగా, ఆ రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, గురువారం 4 రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులను మార్చారు. అందులో తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన స్థానంలో త్వరలోనే ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఒకరికి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి శ్రీనివాస్ ఈ పోస్టులో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు ఆయన రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.