మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి  మృతి

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న అనారోగ్యంతో చనిపోయారు.  చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఏరీయా ఉసూర్ బ్లాక్ లో రాజిరెడ్డి కన్నుమూసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన రిలీజ్ చేశారు. 

మల్లా రాజిరెడ్డి స్వస్థలం బీజాపూర్ జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్ పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి.  ఆయన వయసు ప్రస్తుతం 70 ఏళ్లు.  రాజిరెడ్డిపై కోటి రూపాయల నజరానా ప్రకటించింది చత్తీస్ గఢ్ ప్రభుత్వం. ఛత్తీస్ గఢ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహారించారు మావోయిస్టు రాజిరెడ్డి.