కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

అర్ధరాత్రి ఈ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, కొన్ని గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.