హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలోని టాటానగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరుపుల బెడ్ తయారుచేసే ఈ కంపెనీలో 2023 ఆగస్టు 20 ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
షాట్ సర్క్యూట్ వల్లనే ఈ ఆగ్నిప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నాయి.
మొత్తం మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫాహిం(ఇమ్రాన్ ఖాన్ ) అనే వ్యక్తికి చెందిన ఈ పరుపుల గోదాంలో సుమారుగా రూ. 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.