
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభు దేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మై డియర్ భూతం'. తమిళ దర్శకుడు ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్పై రమేష్ పి పిళ్ళై నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రచార జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్తో సాగిపోతున్న ఈ సాంగ్ లో ప్రభుదేవా డాన్స్ తో ఇరగదీశాడు. తనదైన స్టెప్స్తో ప్రభుదేవా ఆకట్టుకున్నారు. నీ మనసు కన్న కళలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్ అంటూ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటను అరవింద్ అన్నెస్ట్ పాడగా.. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి లిరిక్స్ అందిచారు. రాజేష్, డి. ఇమ్మాన్ అందించిన బాణీలు ఈ సాంగ్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.