ఇంటింటికీ వైద్య పరీక్షలు చేయాలి : ఈటల

ఇంటింటికీ వైద్య పరీక్షలు చేయాలి : ఈటల

ప్రతీ ఇంటిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి ఈటల రాజేందర్‌. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల న్యుమెనియా వంటి  లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని కోరారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి అలాంటి లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనాకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులతో చర్చించారు.  ఏ ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా, అలుపెరుగని పోరాటం చేయాల్సిన అవసరం మనపైనే ఉందని రాజేందర్‌ పిలుపునిచ్చారు.