ORR దగ్గర కారులో మహిళా డాక్టర్ డెడ్ బాడీ

ORR దగ్గర కారులో మహిళా డాక్టర్ డెడ్ బాడీ

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో ఓ మెడికో విద్యార్థి అనుమానాస్పది స్థితిలో చనిపోయింది. కారులో స్పృహ తప్పి పడపోయి ఉన్నప్పుడు.. ఆమె చేతికి ఇంజెక్షన్ కాన్ల పెట్టి ఉండటంతో.. విషం తీసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రపురం బిహెచ్ఇఎల్ హెచ్ఐజి కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి రచన రెడ్డి (26) నివాసం ఉంటోంది.

ఎంబీబీఎస్ పూర్తి చేసిన రచన రెడ్డి బాచుపల్లిలోని మమత ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. విధుల్లో భాగంగా సోమవారం ఉదయం ఆమె ఇంటి నుంచి ఇంటర్నషిప్ చేస్తున్న హాస్పిటల్ కు కారులో బయలు దేరింది. కారు కిష్ణారెడ్డి పేట్ రింగ్ రోడ్డు దగ్గర పక్కనే ఆగివుండగా.. అందులో ఆమె స్పృహతప్పి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అమీన్ పూర్ సిఐ నాగరాజు.. స్పృహ తప్పి ఉన్న రచన రెడ్డిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె సాయంత్రం చనిపోయింది. రచనారెడ్డి చేతికి ఇంజెక్షన్ కాన్ల పెట్టి ఉండటంతో.. విషం తీసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.