తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు .. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్

 తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు .. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఆదివారం మరొకటి ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. 

ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్​ సిటీలోనూ తేలికపాటి వర్షం పడొచ్చని తెలిపింది.