17 జిల్లాలకు పొగమంచు హెచ్చరిక​.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​

17 జిల్లాలకు పొగమంచు హెచ్చరిక​..  వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పొగమంచుపై హైదరాబాద్​వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​జారీ చేసింది. తెలంగాణలోని 17 జిల్లాల్లో పొగమంచు బుధవారం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సీనియర్ సిటిజన్లు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది. బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని పేర్కొంది.