తమ్ముడి మృతి తట్టుకోలేక ఆగిన అన్న గుండె

తమ్ముడి మృతి తట్టుకోలేక ఆగిన అన్న గుండె

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. రెడ్డి కాలానికి చెందిన బోగ శ్రీనివాస్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఇవాళ ఉదయం శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. అతడి అన్న బొగ సచిన్ స్మశానవాటికలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అయితే తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు కుమారులు చనిపోవడంతో  ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగపోయింది. అంత్యక్రియలకు వచ్చిన బంధువుల రోధనలు మిన్నంటాయి. సచిన్ కోరుట్ల పట్టణంలోని ఓ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుండేవాడని స్థానికులు తెలిపారు.