ప్రతి కుటుంబం సంతోషాలతో విరాజిల్లాలి:మంత్రి మల్లారెడ్డి

ప్రతి కుటుంబం సంతోషాలతో విరాజిల్లాలి:మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సంప్రదాయ బద్దంగా పంచెకట్టులో పటాకులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. దివాళీ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.  తెలంగాణ మాదిరిగా దేశ ప్రజల అందరి జీవితాల్లో ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖ శాంతులు, సిరిసంపదలతో తులతూగాలన్నారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పటాకులు కాల్చి దీపావళి పండుగ జరుపుకున్నారు.