పంచవటి కాలనీలో గణనాథుడిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

పంచవటి కాలనీలో గణనాథుడిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్ పంచవటి కాలనీలో గణేశ్​ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడిని సోమవారం స్థానిక  కార్పొరేటర్ సుభాష్ నాయక్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి హాజరై గణనాథుడిని దర్శించుకున్నారు. కార్పొరేటర్ పోచయ్య, బీఆర్ఎస్ నాయకులు జావిద్ ఖాన్, పంచవటి కాలనీ అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ రెడ్డి, ముక్తేశ్వర్ రెడ్డి, రేగు శ్రీనివాస్, మురళి, కాలనీ వాసులు, యువత పాల్గొన్నారు.  

- వెలుగు, మేడిపల్లి