సీతక్కతో సెర్ప్ అదనపు సీఈవో భేటీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి..!

సీతక్కతో సెర్ప్ అదనపు సీఈవో భేటీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి..!

హైదరాబాద్, వెలుగు:  మంత్రి సీతక్కను సెర్ప్  అడిషనల్  సీఈఓ కాత్యాయని దేవి కలిశారు. ఇటీవలే సెర్ప్  అడిషనల్  సీఈవోగా ఆమె నియమితులయ్యారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యానికి తగ్గట్లు పనిచేయాలని కాత్యాయనికి మంత్రి సూచించారు. 

స్థానికంగా  లభించే వస్తువులు, ఉత్పత్తులతో మహిళా సంఘాలు పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాల్లో  విజయవంతంగా నడుస్తున్న మహిళా స్వయంసహాయక బృందాలను గుర్తించి మొదటి విడతలో పరిశ్రమలు ఏర్పాటు చేయించాలన్నారు.