లాయర్నై నా కేసులు నేనే వాదించుకున్నా: సీతక్క

 లాయర్నై  నా కేసులు నేనే వాదించుకున్నా: సీతక్క

అన్ని దానాల్లో విద్యా దానం ఎంతో గొప్పదన్నారు మంత్రి సీతక్క. గండిపేటలోని ఎన్టీఆర్ ట్రస్ట్  స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు సీతక్క. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇక్కడకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నక్సలైట్ గా ఉన్న తాను బయటకొచ్చి చదువుకుని లాయర్ గా తన కేసులు తానే వాదించుకున్నానని చెప్పారు. తాను చేసిన సేవ మాత్రమే తనను ఇక్కడ నిలబెట్టిందన్నారు. ఎదుటవారి సమస్యలు పరిష్కరించే స్థాయికి విద్యార్థులు వెళ్లాలని చెప్పారు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎందరికో రాజకీయ బిక్ష పెట్టారు.. అందులో తానూ ఒకరినని చెప్పారు సీతక్క. తన పొలిటికల్ లైఫ్ టీడీపీలోనే స్టార్ట్ అయ్యిందన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో ఎందరినో జాయిన్ చేశానని తెలిపారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు పెట్టిన ఈ స్కూల్ ఎందరికో జీవితం ఇచ్చిందన్నారు.