దీపావళి వేడుకల్లో మంత్రి తలసాని కుటుంబ సభ్యులు

దీపావళి వేడుకల్లో మంత్రి తలసాని కుటుంబ సభ్యులు

రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దివాళీ వేడుకలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంట సమేతంగా ఘనంగా జరుపుకున్నారు.  విద్యుత్ దీపాల కాంతుల మధ్య  పటాకులు కాలుస్తూ సరదాగా గడిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

దేశ ప్రజల జీవితాల్లో పండుగ వెలుగులు విరజిమ్మాలని.. సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ చల్లంగా ఉండాలన్నారు. సికింద్రాబాద్ మారేడ్ పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు...భద్రతా సిబ్బంది తో కలిసి తలసాని పటాకులు కాల్చి దీపావళి పండుగ జరుపుకున్నారు.చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాలకు దీపావళి ప్రతీకగా నిలుస్తుందన్నారు.