అక్టోబర్ 2న గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ

అక్టోబర్ 2న గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ

సికింద్రాబాద్ : అక్టోబర్ 2వ తేదీన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గాంధీ హాస్పిటల్, ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం నిర్మాణ పనులతో పాటు బన్సీలాల్ పేటలోని మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ పరిశీలించారు.

అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దేవీ నవరాత్రుల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.