ఈ నెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావి ప్రారంభం:మంత్రి తలసాని

ఈ నెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావి ప్రారంభం:మంత్రి తలసాని

సికింద్రాబాద్ లోని బన్సీలాల్‌పేట మెట్లబావిని నవంబర్ నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెట్లబావి  పునరుద్ధరణ పనులు మరో 15 రోజుల్లో పూర్తవుతాయన్నారు.మున్సిపల్‌ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌తో కలిసి మెట్లబావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.

చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో మెట్లబావి పునరుద్దరణ చేపట్టినట్లు తెలిపారు. మెట్లబావితో బన్సీలాల్ పేట ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.  మెట్లబావి పరిసరాలను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మెట్లబావి పునరుద్ధరణతో నీటి సమస్య కూడా తీరుతుందన్నారు.