
- అలర్ట్గా ఉండండి
- ఆఫీసర్లకు మంత్రి ఉత్తమ్ ఆర్డర్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. పెద్దవాగు కట్ట కొట్టుకుపోయిందని, ఈ నేపథ్యంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. అన్ని జిల్లాల సీఈలు అలర్ట్గా ఉండాలని, సెక్రటరీ అనుమతి లేకుండా ఎవరూ హెడ్ క్వార్టర్ దాటి బయటికి వెళ్లొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘చిన్న, మధ్య, పెద్ద ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరదను గంటకోసారి మానిటర్ చేయాలి. గేట్లు మంచిగా పని చేస్తున్నాయో.. లేవో చెక్ చేసుకోండి. పరిస్థితికి అనుగుణంగా వరదను కిందికి వదలండి. కలెక్టర్, ఎస్పీల సహకారంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు వార్నింగ్ ఇచ్చి అలర్ట్ చేయండి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లంతా డ్యూటీలో ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే ఈఎన్సీ, సెక్రట రీలకు తెలియజేయాలి’’అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే.. పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఫోన్లో పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.