అలెర్ట్.. భారతీయులెవరు గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దు

అలెర్ట్.. భారతీయులెవరు గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దు

ఇరాన్ ప్రతీకార దాడి.. ఉక్రెయిన్ విమానం క్రాష్, గల్ఫ్ లో నెలకొన్న యుద్ధ మేఘాలతో భారత్ అప్రమత్తమైంది. భారతీయులెవరు ఇరాక్, ఇరాన్, గల్ఫ్ దేశాలకు వెళ్లవద్దని.. విమాన ప్రయాణాలు మానుకోవాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప ఆ దేశాలకు వెళ్లవద్దని సూచించింది. ఇరాక్, ఇరాన్ లో ఉన్న ఇండియన్స్ అలర్ట్ గా ఉండాలని చెప్పింది విదేశాంగ శాఖ. బయట ఎక్కువగా తిరగవద్దని సూచించింది. బాగ్దాద్ లోని భారత ఎంబసీ, ఎర్బిల్ లో ఉన్న కాన్సులేట్ కార్యాలయాలు పని చేస్తున్నాయని, సమస్యలుంటే అక్కడ సంప్రదించాలని విదేశాంగ శాఖ తెలిపింది.

ఇరాన్, ఇరాక్, గల్ఫ్ దేశాలకు వెళ్లే భారత విమానాలను కూడా అలర్ట్ చేశారు భారత  సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్పారు. విమానాల రాకపోకలపై మరింత దృష్టిపెట్టాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థలకు సూచించినట్టు చెప్పారు. గల్ఫ్ రీజియన్ లో టెన్షన్ పరిస్థితులు ఉండటంతో.. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు.