టీఆర్‌‌ఎస్ కార్యకర్తలకే 10 వేలు ఇస్తున్నరు

టీఆర్‌‌ఎస్ కార్యకర్తలకే 10 వేలు ఇస్తున్నరు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: వరద బాధితులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకే జీహెచ్ఎంసీ అధికారులు రూ.10 వేల చొప్పున ఇస్తున్నరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. జనం ఇబ్బందులను అధికార పార్టీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని శనివారం ఒక ప్రకటనలో
ఫైరయ్యారు. జీహెచ్ఎంసీ ఆఫీసర్లు టీఆర్ఎస్ కార్యకర్తలను వెంటబెట్టుకొనిమరీ నగదు పంపిణీ చేస్తున్నారని, ఇకపై అలాచేస్తే బస్తీల్లోనే అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలు బాధితులతో భేరాలు ఆడుతున్నారని, పది వేలు ఇప్పించి అందులో ఐదువేలు నొక్కేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

For More News..

కొన్ని దేశాల ఆర్మీలు పవర్ ఫుల్ అన్నది భ్రమే!

పంట పెట్టుబడి తగ్గాలె.. రైతుల ఆమ్దాని పెరగాలె

పంజాబ్లో ఆరేళ్ల దళిత చిన్నారిపై రేప్.. ఈ ఘటనపై గాంధీలు మాట్లాడరా?