నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే సీతక్క పేద ప్రజల కోసం మంచి ఆలోచన చేశారు. పేదలకు సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. లాక్ డౌన్ వల్ల చాలామందికి ఒక పూట తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాళ్ల ఆకలిని తీర్చేలా సీతక్క కొత్త ఛాలెంజ్ ను విసురుతున్నట్లు వీడియో ద్వారా తెలిపారు.
గోహంగర్ గో పేరుతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో ఒకరు కొంత మంది పేదలకు ఆహారం పంపిణీ చేయాలి. వారు మరొకరికి ఇలాగే ఛాలెంజ్ చేయాలి. ఎవరికీ ఉపయోగపడని ఛాలెంజుల కన్నా ఆకలితో అలమటించేవారి ఆకలిని తీర్చే ఈ ఛాలెంజ్ మంచిదంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే లాక్ డౌన్ క్రమంలో ఇంట్లో కాళీగా ఉన్న కొందరు రకరకాల ఛాలెంజ్ లతో టైమ్ పాస్ చేస్తున్న విషయం తెలిసిందే.
My #GoHungerGo challenge to my social media followers and to Madam Governor @DrTamilisaiGuv, to my brothers @revanth_anumula @KVishReddy and @mohdalishabbir please support this kill hunger of poor and challenge to others ?#GoCoronaGo @INCIndia @MahilaCongress @RahulGandhi pic.twitter.com/bi946oik0u
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) April 27, 2020