రైతు బంధు సమితి చైర్మన్​గా రాజయ్య బాధ్యతలు

రైతు బంధు సమితి చైర్మన్​గా రాజయ్య బాధ్యతలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ గా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య బాధ్యతలు స్వీకరిం చారు. సోమవారం ఉదయం పబ్లిక్‌‌ గార్డెన్‌‌ లోని రైతుబంధు సమితి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాజ య్య  మీడియా మాట్లాడారు. 

సీఎం కేసీఆర్‌‌ ఆధ్వర్యంలో పదేండ్లుగా వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి జరిగిందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశ పెట్టి  రైతు పక్షపాతిగా నిలిచారని తెలిపారు. 1,60,995 సభ్యులతో రైతు బంధు సమితి అతిపెద్ద సంస్థగా ఉందన్నారు. సీఎం సహ కారంతో భవిష్యత్తులో మరింత బలోపేతం చేసి ప్రభుత్వాన్ని రైతులకు చేరువ చేస్తానని వివరించారు.