టీఆర్ఎస్ కు ముగింపు పలికేది కాంగ్రెస్ పార్టీనే

టీఆర్ఎస్ కు ముగింపు పలికేది కాంగ్రెస్ పార్టీనే

జగిత్యాల‌: తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలో, కేసీఆర్ లాంటి వ్యక్తి సీఎం అయినందుకు బాధ పడాలో అర్థం కావడం లేదని అన్నారు కాంగ్రెస్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ జ‌గ్గారెడ్డి. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ప్రాజెక్టు విషయంలో జగన్ కు ఎందుకు సహకరిస్తున్నార‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు. జగన్ కు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టింది కేసీఆర్ కాదా ..? అని అడిగారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీళ్ళు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే కంది పంట ఎందుకు సాగు చేయాలన్నారు జ‌గ్గారెడ్డి.
కోటి మెట్రిక్ టన్నుల వరి పండిందని చెబుతున్న కేసీఆర్ ఇప్పటివరకు వాటిలో 47 శాతం కూడా కొనలేదని అన్నారు.

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమ‌ని, ఎమ్మెల్యే గా ఓడిపోయినప్పటికీ త‌న‌ను మూడు నెలల్లోనే మళ్లీ ఎమ్మెల్సీగా గెలిపించారన్నారు. టీఆర్ఎస్ కు ముగింపు పలికేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు జ‌గ్గారెడ్డి.

mla jagga reddy comments on cm kcr in jagtial