వికారాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీసీల హక్కుల సాధనకు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని, మాట్లాడారు.
బీసీ కుల గణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని కోరారు.