అక్టోబర్ లో తెలంగాణకు ప్రధాని మోదీ

అక్టోబర్ లో తెలంగాణకు ప్రధాని మోదీ

హైదరాబాద్​, వెలుగు :  వచ్చే నెల 3 లేదా 4 వ తేదీన రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.  ఈ విషయమై పీఎంవో నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల పర్యటనకు మోదీ వస్తున్నట్లు పీఎంవో సమాచారం అందినట్లు  తెలుస్తోంది.
 

పార్టీ పరమైన కార్యక్రమాలనూ ఖరారు చేసి, వెంటనే సమాచారం అందించాలని రాష్ట్ర కార్యాలయాన్ని పీఎంవో  కోరింది. దాంతో మోదీ పాల్గొనాల్సిన పార్టీ పరమైన ప్రోగ్రామ్ లను ఖరారు చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు.