
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శక్తి, అంతర్జాతీయ వేదికపై భారత గొంతును స్పష్టంగా వినిపించే డైనమిజం భారత దేశానికి పెద్ద ఆస్తి అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసించారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్ చేపట్టిన దౌత్య ప్రయత్నాలు దేశ ఐక్యతను చాటాయన్నారు. ఈ ప్రయత్నాలు స్పష్టమైన సమాచారాన్ని చెప్పడం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి బలమైన సందేశాన్ని ఇచ్చాయని చెప్పారు.
దౌత్యపర్యటన పూర్తయిన నేపథ్యంలో ఆయన ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పహల్గామ్లో జరిగిన టెర్రరిస్టు ఎటాక్కు ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను ఈ దౌత్య ప్రయత్నాలు స్వీయరక్షణ హక్కుగా సమర్థించాయని, అంతర్జాతీయ మద్దతును సమీకరించాయని తెలిపారు.
ఈ దౌత్యం భారత్ సాఫ్ట్ పవర్, పబ్లిక్ డిప్లొమసీ విలువను చాటిందన్నారు. భవిష్యత్ వ్యూహంలో టెక్నాలజీ, ట్రేడ్, ట్రెడిషన్(మూడు ‘టీ’లు) కీలకమని, ఇవి భారత్ను ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గంగా చూపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.