మోడీ మన్‌‌కీ బాత్‌‌లో మన మెట్లబావి

మోడీ మన్‌‌కీ బాత్‌‌లో మన మెట్లబావి

హైదరాబాద్: సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని చారిత్రక మెట్ల బావికి మళ్లీ వైభవం తీసుకొచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. ఆదివారం ‘మన్‌‌కీ బాత్‌‌’ కార్యక్రమంలో మాట్లాడిన పీఎం.. ఈ బావి గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. మట్టి, చెత్తతో నిండిపోయిన చారిత్రక మెట్ల బావిని.. రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌‌మెంట్ ద్వారా బాగు చేశారు.  కొందరు వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి పనులు  చేస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు.