
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలో తన దూకుడు చూపించబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ఓ ప్రీమియం రెస్టారెంట్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. 'జొహార్ఫా' పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. కస్టమర్ల కోసం పర్షియన్, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్లో అందించనున్నట్లు తెలిపాడు. దీంతో అభిమానులు సిరాజ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓపెనింగ్ తేదీ ఎప్పుడో ఇంకా వెల్లడించలేదు.
సినిమా, క్రికెట్ సెలబ్రిటీలు తమ రంగాల్లో రాణిస్తూనే బిజినెస్ రంగంలో అడుగుపెడుతున్నారు. ఆర్థికంగానూ ఎదగాలనే ఆలోచనతో వ్యాపారాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే బెంగళూరు, ముంబయి, పుణే, కోల్ కతా,ఢిల్లీలో రెస్టారెంట్ పెట్టిన కోహ్లీ ఇపుడు మన హైదరాబాద్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. తాజాగా టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడాఈ లిస్ట్లో చేరిపోయాడు.
ప్రస్తుతం సిరాజ్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో టీమిండియా తొలి టెస్ట్ ఆడనుంది. బుమ్రాతో పాటు సిరాజ్ పై ఈ సిరీస్ లో భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా ఐదు టెస్టులు ఆడని నేపథ్యంలో అతని లేని మ్యాచ్ లో భారత బౌలింగ్ దళానికి సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ పై పర్వాలేదనిపించిన సిరాజ్.. అంతకముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్క్వాడ్ లో చోటు కోల్పోయాడు. అయితే టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఈ హైదరాబాదీ పేసర్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.