నిర్మల్ బొమ్మల కథతో రాధాకృష్ణ సినిమా

నిర్మల్ బొమ్మల కథతో రాధాకృష్ణ సినిమా
అనురాగ్‌‌‌‌, ముస్కాన్ సేథీ జంటగా, లక్ష్మీపార్వతి కీల‌‌‌‌క‌‌‌‌ పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకుడు. పుప్పాల కృష్ణకుమార్ సాగ‌‌‌‌రిక నిర్మాత. ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ని ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌లో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ‘క‌‌‌‌నుమ‌‌‌‌రుగైపోతున్న చేతి వృత్తుల క‌‌‌‌ళాకారుల్ని ప్రోత్సహించాల‌‌‌‌నే సోషల్ కాజ్‌‌‌‌తో, నిర్మల్ బొమ్మలు చేసే కళాకారుల ఇబ్బందులే మెయిన్ థీమ్‌‌‌‌గా ఈ సినిమా చేశారు. అందుకు దర్శక నిర్మాతల్ని అభినందిస్తున్నాను. మంచి ఆశ‌‌‌‌యంతో తీసిన సినిమా కాబట్టి ప్రేక్షకులు గొప్ప విజ‌‌‌‌యాన్నిస్తార‌‌‌‌ని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘ప్రాచీన క‌‌‌‌ళ‌‌‌‌ల్ని కోల్పోతే మ‌‌‌‌న మ‌‌‌‌నుగ‌‌‌‌డ‌‌‌‌నే కోల్పోతాం. మంచి ప్రయత్నంగా తీసిన ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని లక్ష్మీపార్వతి అన్నారు. హీరో హీరోయిన్స్, దర్శక నిర్మాతలతో పాటు శ్రీనివాసరెడ్డి, నటుడు అలీ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, కో- ప్రొడ్యూస‌‌‌‌ర్ శ్రీ‌‌‌‌నివాస్ కానూరి, ఎడిట‌‌‌‌ర్ వెంక‌‌‌‌ట ప్రభు త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.