కేసీఆర్ కచ్చితంగా జైలుకు పోక తప్పదు

కేసీఆర్ కచ్చితంగా జైలుకు పోక తప్పదు

సీఎం కేసీఆర్  ఏదో ఒక రోజు కచ్చితంగా జైలుకు పోకతప్పదన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఆయన చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుందన్నారు.కేసీఆర్ చేసిన అవినీతిపై ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని చెప్పారు. కేసీఆర్ కు మతిమరుపు ఎక్కువైందన్నారు. ఆయనిక సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం బెటర్ అని చెప్పారు. వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రైస్ మిల్లులను ఆధునికీకరించుకోవాలని మాత్రమే రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం తెలిపిందన్నారు.
 
హుజురాబాద్ లో  కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమిపాలు కావడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు అర్వింద్. బీజేపీ సాధించిన ఘన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు.