దళిత బంధు ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

దళిత బంధు ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
  • భువనగిరిలో అందరికీ దళిత బంధు ఇస్తే రాజీనామా చేస్త 
  • వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయను: కోమటిరెడ్డి   

చౌటుప్పల్, వెలుగు: రాష్ట్ర సర్కార్ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో పాటు నియోజకవర్గ పరిధిలోని దళితులందరికీ దళిత బంధు ఇస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయబోనని, టీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతు తెలుపుతానని.. ఈ మేరకు బాండ్ పేపర్ కూడా రాసిస్తానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ ఏ పనులకూ నిధులివ్వడం లేదని, భూములమ్మి దళిత బంధుకు శ్రీకారం చుట్టిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లకు నిధులివ్వడంతో పాటు దళిత బంధు ఇస్తే రాజీనామా చేస్తానన్నారు.