కరెంట్ బిల్లులపై సీఎంకు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

కరెంట్ బిల్లులపై సీఎంకు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

కరెంట్ బిల్లుల వ్యవహారంపై సీఎం కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. కరెంట్ బిల్లులను సవరించాలని కోరుతూ సోమవారం లెటర్ రాసిన ఎంపీ.. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ బిల్లు పేద ప్రజలను మరింత పేదవారిగా మారుస్తుందని.. ప్రజలపై రెండు, మూడింతల భారం వేయడం తగదన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలు ఎందుకన్నారు.

కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ ఖజానా నింపడం కోసం పేద ప్రజల రక్తం పిలుస్తవా అని ప్రశ్నించిన కోమటిరెడ్డి.. వెంటనే బిల్లును సవరించి ప్రజలకు ఊరట కలిగించాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఉద్యమిస్తామని హెచ్చరించారు.