భారత జట్టులో మాజీ కెప్టెన్ ధోనీకి చోటు దక్కడం కష్టమేనన్నాడు మాజీ ఒపెనర్ వీరేంద్ర సెహ్వగ్ . జట్టులో చోటెక్కడని.? ఇప్పటికే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి వారు మంచి ఫామ్ లో ఉన్నారన్నారు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడం జట్టుకు మంచిదన్నారు. ఇటీవల న్యూజిలాండ్లో విఫలమైన కోహ్లీపై కూడా స్పందించాడు సెహ్వగ్. కోహ్లీ క్లాస్ ఆటగాడు. సచిన్, స్టీవ్ వా, కలీస్, పాంటింగ్ వంటి దిగ్గజాలు కూడా ఒక్కోసారి ఫామ్ లో లేకండా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారన్నాడు. ఇటీవలీ వన్డేలు,టీ20ల్లో న్యూజిలాండ్ భారత్ కంటే బాగా ఆడిందన్నాడు. టీ20 ఫార్మాట్లలో త్వరగా కుదురుకోవడం అంత ఈజీ కాదన్నాడు.
see more news