
- మహారాష్ట్రలో ఘటన
ముంబై: క్యాన్సర్తో బాధపడుతున్న యశోద గైక్వాడ్(60) అనే వృద్ధురాలిని ఆమె మనువడే చెత్త కుప్పలో పడేశాడు. ఈ అమానవీయ ఘటన ముంబైలో జరిగింది. ఆరెకాలనీలోని చెత్తకుప్పలో పడి ఉన్న ఆ పెద్దావిడను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి దర్యాప్తు ప్రారంభించారు.
ఆమె కుటుంబ సభ్యుల గురించి ఆరా తీస్తున్నారు.తాను చర్మ క్యాన్సర్తో బాధపడుతున్నానని..తన మనవడే చెత్తకుప్పలో వదిలేసి వెళ్లాడని వృద్ధురాలు పోలీసులకు వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు మలాడ్, కండివాలిలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఆమె చెప్పినదాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.