
ఐపీఎల్ను సూపర్ హిట్ చేయాలంటే.. ఓపెనింగ్ షో కూడా అదే స్థాయిలో ఉండాలి. అందుకే ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్తో గ్రాండ్ ఓపెనింగ్కు సర్వం సిద్ధమైంది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన సీఎస్కే.. ఇన్టైమ్లో కోలుకుని మళ్లీ బరిలోకి దిగుతుండటం శుభపరిణామం. దీనికితోడు ధోనీ ఆట కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి గ్రాండ్ ఓపెనింగ్ షో సూపర్ సక్సెస్ అవుతుందని నిర్వాహకుల నమ్మకం. ఇక ఇరుజట్లను ఓసారి పరిశీలిస్తే.. ఈ మ్యాచ్లో ముంబై ఫేవరెట్. స్లో స్టార్టర్ అని పేరున్నా.. పేపర్ మీద చూస్తే చాలా బలమైన జట్టు వాళ్ల సొంతం. ఐపీఎల్ కోసం అద్భుతమైన ప్లాన్స్తో సిద్ధమైన టీమ్ ముంబై. ప్రత్యర్థులను వణికించే రోహిత్, డికాక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, క్రునాల్, పొలార్డ్తో కూడిన పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ట్రెంట్ బౌల్ట్, కూల్టర్నీల్ కూడా చెయ్యేస్తే తిరుగుండదు. డెత్ బౌలింగ్ కింగ్ బుమ్రా ముంబైకి అతిపెద్ద బలం.
మరోవైపు సీఎస్కే కోర్ టీమ్ బాగానే ఉన్నా.. రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. రైనా ప్లేస్లో ఆడించాలనుకుంటున్న రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోలేదు. అయితే వాట్సన్, రాయుడు, కేదార్, జడేజా, బ్రావో.. హోప్లెస్ పరిస్థితుల్లోనూ మ్యాచ్లను గెలిపించగలరు. ఇప్పుడు కూడా వారి నుంచి అదే కోరుకుంటున్నారు. అయితే వీళ్ల ఎక్స్పీరియెన్స్ సీఎస్కేకు అతిపెద్ద వరం. మిచెల్ శాంట్నర్, లుంగి ఎంగిడి ఫారిన్ కోటాను కంప్లీట్ చేస్తారు. ఒకవేళ సామ్ కరన్ అందుబాటులోకి వస్తే హిట్టింగ్ బలం పెరుగుతుంది. హేజిల్వుడ్ కూడా బరిలోకి దిగితే బౌలింగ్ బలం రెట్టింపవుతుంది. వీళ్లందరికంటే వికెట్ల వెనుకాల మహేంద్రుడు ఉన్నాడనే సంగతి ముంబైకి బాగా తెలుసు.