సినిమా పనైపోయింది అన్నారు.. వైరల్ అవుతున్న నాగార్జున కామెంట్స్

సినిమా పనైపోయింది అన్నారు.. వైరల్ అవుతున్న నాగార్జున కామెంట్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున(King Nagarjuna) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ(Naa Saamiranga). ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ(Vijay Binny) ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారుతున్నాడు. టాలీవుడ్ మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్(Raj Tharun) కూడా కీ రోల్స్ చేస్తున్న ఆ సినిమాకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. టీజర్, ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇందులో భాగంగా నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున సినిమా గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.. సెప్టెంబర్ 20 నాన్నగారు అక్కినేని నాగేశ్వర రావు పుట్టినరోజున. ఆరోజు ఆయన దండం పెట్టుకున్నప్పుడు.. నాన్న నా మనసులో చెప్పిన మాట.. వెళ్లి చేయరా సినిమా నా సామిరంగ.. అని. ఆ ధైర్యంతోనే నా సామిరంగ సినిమాను పూర్తి చేశాము. సంక్రాంతి పండక్కి అక్కినేని ఫ్యాన్స్ ఒక మాట చెప్పాలి... పండగకు కిష్టయ్య వస్తున్నాడు. బాక్సాఫీస్ కొడుతున్నాడు.. అని. ఇక సంక్రాంతికి మన సినిమాతో పాటు.. మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్ సైంధవ్ కూడా వస్తున్నాయి. వాళ్ళందిరికీ ఆల్ ది బెస్ట్.

ఒకప్పటికీ.. ఇప్పటికీ.. సినిమాలు చూసే విధానం చాలా మారింది. టీవీలు రాగానే సినిమాలు ఎవరూ చూడరన్నారు. ఫోన్లు వచ్చాయి, ఓటీటీ వచ్చాక కూడా అదే మాట అన్నారు. కానీ, ప్రేక్షకులు మాత్రం సినిమాలు చూస్తూనే ఉన్నారు. సంక్రాంతికి సినిమా చూడడం అనేది మన తెలుగువారి ఆనవాయితీ. దాన్ని ఎవరూ మార్చలేరు.. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.