బాలికపై అఘాయిత్యం కేసు నిందితుడికి పోలీస్ కస్టడీ

బాలికపై అఘాయిత్యం కేసు నిందితుడికి పోలీస్ కస్టడీ

జూబ్లీహిల్స్ బాలికపై అఘాయిత్యం కేసులో ప్రధాన నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదిద్దున్ మాలిక్ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఐదుగురు మైనర్ల కస్టడీకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు వారి కస్టడీకి కూడా అనుమతిస్తే  పోలీసులు మైనర్లను కూడా ప్రశ్నించనున్నారు.

ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్లో బాలికపై అఘాయిత్యం కేసులో పోలీసులు ఎమ్మెల్యే కొడుకు సహా ఆరుగురు నిందితులను అరెస్ట్​చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాదుద్దీన్​మాలిక్​(18) మినహా మిగిలిన ఐదుగురు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అనుమతించింది.