పంత్‌‌‌‌‌‌‌‌ బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌: నాసిర్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌

పంత్‌‌‌‌‌‌‌‌ బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌: నాసిర్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌: కొత్త ఏడాదిలో రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ ‘బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌’ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ అవుతాడని ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మాజీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ నాసిర్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో అతన్ని ఆపడం కష్టమని అంచనా వేశాడు. ‘పంత్‌‌‌‌‌‌‌‌ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఆందోళనకు గురైంది. కానీ ఇప్పుడు అతను చాలా బాగా కోలుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రికీ పాంటింగ్‌‌‌‌‌‌‌‌.. పంత్‌‌‌‌‌‌‌‌ కోలుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. 

అతడి ఆరోగ్య పరిస్థితి గురించి రికీని అడిగి తెలుసుకున్నా. త్వరలోనే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి రాబోతున్నాడు. ఇక ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపుతాడు. మొత్తానికి కొత్త ఏడాదిలో పంత్‌‌‌‌‌‌‌‌ బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా ఎదుగుతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని హుస్సేన్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర సరికొత్త ప్లేయర్లుగా అవతరిస్తారని జోస్యం చెప్పాడు. ఈ ఇద్దరిలో సూపర్‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉందని కితాబిచ్చాడు. పరిస్థితులు అనుకూలిస్తే రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్‌‌‌‌‌‌‌‌ను శాసిస్తారని చెప్పుకొచ్చాడు.