ఢిల్లీలో ఎడ్యుకేషన్ మోడల్.. కాంట్రాక్ట్ మోడలని విమర్శించారు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. కేజ్రీవాల్ సర్కార్ హయాంలో నిరుద్యోగం 5 శాతం పెరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో గెస్ట్ టీచర్ల ఆందోళనలో పంజాబ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గొన్నారు. గెస్ట్ టీచర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల సందర్భంగా అక్కడ అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తోంది. పంజాబ్ లో పర్యటిస్తూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేజ్రీవాల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు సిద్ధూ రంగంలోకి దిగారు. నేరుగా కేజ్రీవాల్ ఇంటిముందే ఆందోళన చేపట్టారు. ఏడేళ్లుగా ఒక్క హామీని అమలుచేయని కేజ్రీవాల్..పంజాబ్ కి వచ్చి హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.
Joined Delhi Guest Teachers Protest outside Chief Minister Arvind Kejriwal Ji's residence in Delhi https://t.co/P7IH0fkBKL
— Navjot Singh Sidhu (@sherryontopp) December 5, 2021